EVM: ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ పిటిషన్‌.. ఏపీ హైకోర్టులో విచారణ

  • తేడా వస్తే అన్నింటినీ లెక్కించాలన్న పిటిషనర్
  • హౌస్‌మోషన్ పిటిషన్‌గా స్వీకరించిన హైకోర్టు
  • రేపు జస్టిస్ శ్యాంప్రసాద్ ఇంట్లో వాదనలు

ఈవీఎంల కంటే ముందే వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ ఓ వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైనా తేడా వస్తే అన్ని వీవీ ప్యాట్లను లెక్కించాలని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హౌస్‌మోషన్ పిటిషన్‌గా హైకోర్టు స్వీకరించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మరోమారు దీనిపై జస్టిస్ శ్యామ్ ప్రసాద్ ఇంట్లో మంగళవారం ఉదయం వాదనలు జరగనున్నాయి.

More Telugu News