Hyderabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టివేత

  • ఓ యువకుడి నుంచి 599.98 గ్రాములు స్వాధీనం
  • విలువ రూ.19 లక్షల పైమాటే
  • బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రహస్యంగా తరలిస్తున్న 599.98 గ్రాముల బంగారాన్ని ఓ యువకుడి వద్ద గుర్తించారు. దీని విలువ రూ.19 లక్షల పైమాటేనని అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టుకోవడం పరిపాటిగా మారింది. ఈనెల 9వ తేదీన ఇదే విమానాశ్రయంలో దుబాయి నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు లోదుస్తుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబుల్లో దాచిపెట్టిన దాదాపు కోటి రూపాయల విలువైన 3.329 కిలో గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగి పక్షం రోజులు కాకముందే మరోసారి భారీగా బంగారం చిక్కడం గమనార్హం. కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

More Telugu News