delhi: ఢిల్లీలో గ్యాంగ్ వార్.. కాల్పుల్లో ఇద్దరు హతం

  • దక్షిణ ఢిల్లీలోని ద్వారక వద్ద కాల్పులు
  • మృతులపై పలు క్రిమినల్ కేసులు
  • భయభ్రాంతులకు గురైన జనాలు

దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఇద్దరు హతమయ్యారు. మృతులను ప్రవీణ్ గెహ్లాట్, వికాస్ దలాల్ గా పోలీసులు గుర్తించారు. వీరిపై పలు హత్యలు, వేధింపులు, దొంగతనం తదితర కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, హర్యానాలలో వీరిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఆస్తికి సంబంధించిన ఒక వివాదం కారణంగా ఈ రెండు గ్యాంగుల మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. దక్షిణ ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన ద్వారక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల నేపథ్యంలో, అక్కడున్న ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవీణ్ గెహ్లాట్ ప్రయాణిస్తున్న ఓ కారును ముగ్గురు వ్యక్తులు ఉన్న మరో కారు వెంబడించింది. అనంతరం ప్రవీణ్ పై కాల్పులను ప్రారంభించిన దుండగులు, 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రవీణ్ ప్రాణాలు వదిలాడు. పక్కనే ఉన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దుండగులపై కాల్పులు జరపగా... క్రిమినల్స్ లోని వికాస్ దలాల్ మృతి చెందాడు.

More Telugu News