Telangana: తెలంగాణలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేస్తుంది: లగడపాటి సర్వే

  • ‘ఆంధ్రా ఆక్టోపస్’ సర్వే వివరాలు వెల్లడి
  • టీఆర్ఎస్ కు 14 నుంచి 16 స్థానాలు
  • కాంగ్రెస్ కు 0-2 స్థానాలు.. బీజేపీకి 0-1 స్థానం

తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ కేతనం ఎగురవేస్తుందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో ఈరోజు సాయంత్రం తన ఎన్నికల సర్వే వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత శాస్త్రీయ పద్ధతిలో జరిగిన సర్వే వివరాలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ కు 14 నుంచి 16 స్థానాలు రావొచ్చని, కాంగ్రెస్ కు 0-2 స్థానాలు, బీజేపీకి 0-1 స్థానం, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని తమ అంచనా అని పేర్కొన్నారు. 

More Telugu News