కేదార్ నాథుడి ఆశీస్సులు తీసుకున్న మోదీ
- జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్ నాథ్ ను దర్శించుకున్న మోదీ
- ప్రధాని హోదాలో ఇక్కడకు రావడం ఇది రెండోసారి
- రేపు బద్రీనాథుడిని దర్శించుకునే అవకాశం
మరోవైపు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, కేదార్ నాథ్ ఆలయ దర్శనం కోసం ఎన్నికల సంఘం అనుమతిని ప్రధాని కార్యాలయం తీసుకున్నట్టు సమాచారం. ప్రధాని పర్యటన అధికారికమైనది కావడంతో ఈసీ అనుమతి తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్ లో ఆయన పర్యటించనున్నారు. రేపు బద్రీనాథ్ ఆలయాన్ని ఆయన సందర్శించే అవకాశం ఉంది.