sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 279 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 100 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతం పైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. తద్వారా గత కొన్ని రోజులుగా మూటగట్టుకున్న నష్టాలను కొంత మేర రికవర్ చేసుకున్నాయి. సెన్సెక్స్ 279 పాయింట్లు లాభపడి 37,393కు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు పుంజుకుని 11,257కు ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.64%), టాటా మోటార్స్ (3.48%), ఇన్ఫోసిస్ (2.47%), వేదాంత (2.22%), ఓఎన్జీసీ (2.00%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-4.07%), భారతి ఎయిర్ టెల్ (-1.87%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.37%), కోల్ ఇండియా (-1.29%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.63%).

More Telugu News