Andhra Pradesh: చంద్రగిరి నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ నిర్ణయం

  • ఈ నెల 19న పోలింగ్
  • ఈసీఐకి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ
  • స్పందించిన ఈసీఐ

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీఐ తాజా నిర్ణయం తీసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని 5 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నెల 19న రీపోలింగ్ ఉంటుందని ఈసీఐ పేర్కొంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం గ్రామాల్లో రీపోలింగ్ జరుపుతామని ఈసీ వర్గాలు తెలిపాయి.

More Telugu News