Machilipatnam: గేదెను ఢీకొట్టి పట్టాలు తప్పిన మచిలీపట్నం ప్యాసింజర్ రైలు

  • వడ్లమానాడు వద్ద పట్టాలు తప్పిన నాలుగు బోగీలు
  • వేగం తక్కువగా ఉండటంతో తప్పిన పెను ప్రమాదం
  • బోగీలను పట్టాలపైకి ఎక్కించేందుకు అధికారుల యత్నం

మచిలీపట్నం ప్యాసింజర్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. నేటి సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరిన మచిలీపట్నం ప్యాసింజర్ రైలు గుడ్లవల్లేరు మండలం వడ్లమానాడు వద్దకు చేరుకోగానే నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఓ గేదె అడ్డుగా రావడంతో రైలు దానిని ఢీకొట్టింది. దీంతో రైలు చివర ఉన్న నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి.

ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులెవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బోగీలను తిరిగి పట్టాలపైకి చేర్చి లైన్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

More Telugu News