Andhra Pradesh: విశాఖ మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి.. ఓ యువతి దుర్మరణం, ఇద్దరికి గాయాలు!

  • ఉత్సవాల్లో జాయింట్ వీల్ ఎక్కిన భవాని
  • కళ్లు తిరగడంతో పైనుంచి పడిపోయిన యువతి
  • ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూత

విశాఖపట్నం జిల్లా పాడేరులో మోదమాంబ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. చాలా మంది భక్తులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవాని(16) అనే బాలిక ఇక్కడ ఏర్పాటుచేసిన జాయింట్ వీల్ ఎక్కింది. అయితే జాయింట్ వీల్ వేగంగా తిరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆమెకు కళ్లు తిరిగాయి. దీంతో ఆమె పైనుంచి కింద పడింది. ఈ సందర్భంగా తల నేరుగా నేలను తాకడంతో ఆమెకు గాయాలు అయ్యాయి.

 వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో చికిత్సను కొనసాగిస్తుండగా ఈరోజు భవాని తుదిశ్వాస విడిచింది. కాగా, ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. చనిపోయిన భవానిది వి.మాడుగుల మండలం గరికబంద గ్రామమని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News