Prakasam District: ఒంగోలులో యువకుడి అనుమానాస్పద మృతి!

  • తిరుపతికి చెందిన యువకుడు అవినాశ్ రెడ్డి
  • ఒంగోలు యువతితో ప్రేమ వ్యవహారం
  • ఆమెను కలిసేందుకు నిన్న ఒంగోలు వచ్చాడు

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఒంగోలుకు చెందిన ఓ యువతిని తిరుపతికి చెందిన యువకుడు అవినాశ్ రెడ్డి ప్రేమించాడు. ఆ యువతిని కలిసేందుకు నిన్న ఒంగోలుకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, అవినాశ్ రెడ్డి మృతి చెందినట్లు అతని తల్లిదండ్రులకు యువతి  తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ సమాచారంతో ఒంగోలు చేరుకున్న అవినాశ్ రెడ్డి బంధువులు అతని మృతదేహంతో యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అవినాశ్ రెడ్డిని యువతి బంధువులే చంపించారని అతని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో యువతిని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News