TTD: తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీని పట్టుకున్న పోలీసులు

  • దర్శనం, వసతి కల్పిస్తానంటూ వంచన
  • నిందితుడ్ని గుంటూరుకు చెందిన కార్తీక్ గా గుర్తింపు
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వారిలో చాలామందికి స్థానిక స్థితిగతులపై అవగాహన కొరవడడంతో తేలిగ్గా దళారీల వలలో చిక్కుకుంటారు. అలాంటి అమాయకులను మోసగించి పబ్బం గడుపుకుంటున్న ఓ దళారీని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఎంతో సులభంగా దర్శనం కల్పిస్తానని, వసతి ఏర్పాటు చేస్తానని చెబుతూ భక్తులను మోసం చేస్తున్న ఆ దళారీని గుంటూరుకు చెందిన కార్తీక్ గా గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News