Kurnool District: యాక్సిడెంట్ ఎలా జరిగిందీ పోలీసులకు వివరించిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్

  • బైక్ ను ఢీకొని అదుపుతప్పిన బస్సు
  • డివైడర్ దాటి ఇవతల రోడ్డుపైకి వచ్చి తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న వైనం
  • పోలీసుల అదుపులో డ్రైవర్

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని మణిపాల్ వెళుతున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా వెల్దుర్తి చెక్ పోస్టు వద్ద తుఫాన్ వాహనాన్ని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు విడిచారు. ఘటన జరిగిన సమయంలో ట్రావెల్స్ బస్సు, తుఫాన్ వాహనం రెండు కూడా అమిత వేగంతో ప్రయాణిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా, ట్రావెల్స్ బస్సు డ్రైవర్ జోసెఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు డ్రైవర్ జోసెఫ్ పోలీసులకు తెలిపాడు. బైక్ ను ఢీకొన్న అనంతరం అదుపుతప్పి పక్క రోడ్ పైకి వెళ్లిందని, అదే సమయంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని కూడా ఢీకొందని వివరించాడు.

More Telugu News