cm: సమీక్షకు హాజరుకాని శ్రీకాకుళం నేతలపై చంద్రబాబు ఆగ్రహం!

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబసభ్యుడి మృతి 
  • సమీక్షకు హాజరుకాని లక్ష్మీదేవి
  • ఆమె రాలేదని చెప్పి మిగిలిన నేతలూ ‘డుమ్మా’

శ్రీకాకుళం టీడీపీ లోక్ సభ నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో ఈ సమీక్ష జరిగింది. అయితే, శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి కుటుంబసభ్యుడొకరు మృతి చెందారు. దీంతో, ఈ సమీక్షకు ఆమె రాలేకపోయారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి రాలేదని చెప్పి, మిగిలిన నేతలు కూడా రాలేదు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష అని తెలిసి కూడా ఎందుకు రాలేదంటూ మండిపడ్డట్లు సమాచారం. ఈ సమీక్షకు పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, ఆముదాలవలస, నరసన్నపేటకు చెందిన నేతలు హాజరయ్యారు.

More Telugu News