noida: యూపీలో దారుణం... 16 ఏళ్ల బాలికపై 51 రోజుల పాటు గ్యాంగ్ రేప్

  • నోయిడాలో చోటు చేసుకున్న దారుణ ఘటన
  • ఇంటి పక్కన ఉన్న బాలికను కిడ్నాప్ చేసి, పశువాంఛను తీర్చుకున్న యువకులు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికను నిర్బంధించిన ముగ్గురు యువకులు... ఆమెపై 51 రోజుల పాటు అత్యాచారం జరిపారు. వివరాల్లోకి వెళ్తే, బాలిక ఇంటి పక్కనే ఉండే సూరజ్, చోటు అనే ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి, ఓ ఇంట్లో నిర్బంధించారు. ఆమెను శారీరకంగా హింసిస్తూ తమ పశువాంఛను తీర్చుకున్నారు.

ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన ఆదిత్య అనే యువకుడు కూడా ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. పారిపోయేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరించారు. ఇలా 51 రోజుల పాటు నరకం అనుభవించిన బాధితురాలు... చివరకు తప్పించుకుని, తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో, నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News