sidhu: మోదీని విమర్శించిన సిద్ధూ.. చెప్పు విసిరిన మహిళ

  • హర్యానాలో ఓ పబ్లిక్ మీటింగ్ లో ఘటన
  • మోదీని విమర్శించడంపై మహిళ ఆగ్రహం
  • పోలీసుల అదుపులో మహిళ

పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై ఓ మహిళ చెప్పు విసరడం కలకలం రేపింది. హర్యానాలో ఓ పబ్లిక్ మీటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సిద్ధూపై చెప్పు విసిరానంటూ పోలీసులతో ఆమె అంటున్న మాటలు ఓ చిన్న వీడియోలో రికార్డ్ అయ్యాయి. మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించేవారిలో సిద్ధూ కూడా ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఏ చిన్న అవకాశం దొరికినా మోదీపై విరుచుకుపడుతుంటారు. 

More Telugu News