venkatesh: 'విక్రమ్ వేదా' రీమేక్ లో వెంకటేశ్ చేయడం లేదట

  • తమిళంలో హిట్ కొట్టిన 'విక్రమ్ వేదా' 
  • మాధవన్ .. విజయ్ సేతుపతి క్రేజ్ పెంచిన సినిమా 
  • 'వెంకీమామ' సినిమాతో వెంకటేశ్ బిజీ

తమిళంలో రెండేళ్ల క్రితం 'విక్రమ్ వేదా' సినిమా వచ్చింది. మాధవన్ - విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి పుష్కర్ - గాయత్రి దర్శకత్వం వహించారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మాధవన్ .. విజయ్ సేతుపతిల క్రేజ్ ను మరింత పెంచింది.

అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారనీ, ఒక కథానాయకుడిగా వెంకటేశ్ నటించనున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ ప్రచారం జోరందుకోవడంతో, సురేశ్ ప్రొడక్షన్స్ వారు స్పందించారు. 'విక్రమ్ వేదా' రీమేక్ లో వెంకటేశ్ చేయనున్నాడంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ప్రస్తుతం వెంకటేశ్ 'వెంకీమామ' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడనీ, ఆయన తదుపరి సినిమా ఏమిటనేది త్వరలో ప్రకటిస్తామని అన్నారు. 

More Telugu News