అక్రమంగా బంగారం దిగుమతులు.. శ్రీకృష్ణ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్!

- దాడులు నిర్వహించిన డీఆర్ఐ అధికారులు
- పన్నులు ఎగ్గొట్టిన కేసులో ఎండీ, కుమారుడు అరెస్ట్
- ప్రదీప్ కు 35 కంపెనీలు ఉన్నాయన్న డీఆర్ఐ
ఈ సందర్భంగా డీఆర్ఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రదీప్ కుమార్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 35 కంపెనీలను నిర్వహిస్తున్నాడని తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈయనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ప్రదీప్ కుమార్ బంగారాన్ని దిగుమతి చేసుకున్నాడనీ, ఇందుకు పన్నులు కూడా చెల్లించలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.