ramadan: రంజాన్ మాసం ప్రారంభం..ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు

  • ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసం రంజాన్
  • దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం
  • తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు

ముస్లిం మతస్థుల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్యమాసాన్ని ముస్లిం మతస్థులు జరుపుకుంటారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. మహనీయుడు మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది ఈ మాసంలోనే కావడంతో ఈ నెలకు అంత ప్రాముఖ్యత నిస్తారని అన్నారు. ‘రంజాన్’ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండగ అని అన్నారు.

More Telugu News