Andhra Pradesh: నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న ఏపీ సీఎం చంద్రబాబు!

  • పనులు జరుగుతున్న తీరుపై సమీక్ష
  • కాంట్రాక్టర్లు, అధికారులతో సమావేశం
  • ఎన్నికలు ముగిశాక రెండోసారి పోలవరంపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మరికాసేపట్లో పోలవరానికి బయలుదేరి అక్కడ పనులు జరుగుతున్న తీరును సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల గురించి అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకుంటారు.

గత నెల 11న ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఓసారి సమీక్ష నిర్వహించారు. దీంతో ఈ సమీక్షా సమావేశాలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను సమీక్షించడంలో ఎలాంటి ఇబ్బంది లేదనీ, కోడ్ ఉల్లంఘన జరగదని అధికారులు సూచించడంతో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు సిద్ధమయ్యారు.

More Telugu News