మోదీని సాగనంపాల్సిందే, తప్పదు: మన్మోహన్ సింగ్
- ఐదేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారు
- అందరూ మోదీ బాధితులయ్యారు
- మోదీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు
కాగా, దేశంలో మోదీ ప్రభంజనం వీస్తోందన్న వాదనలను మన్మోహన్ కొట్టిపారేశారు. సమీకృత అభివృద్ధిపై నమ్మకం లేని, కేవలం తన రాజకీయ ప్రాపకం కోసం పాకులాడుతున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ అనుకూల పవనాలు ఎక్కడ వీస్తున్నట్టు? అని ప్రశ్నించారు.
ఈ ఐదేళ్ల కాలంలో అవినీతి దుర్గంధం నలుదిశలా వ్యాపించిందని, ఊహించలేనంతగా పాకిపోయిందని అన్నారు. ఈ క్రమంలో నోట్ల రద్దు స్వతంత్ర భారతదేశంలోనే అత్యంత భారీ కుంభకోణంగా మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.