Andhra Pradesh: గుంటూరు-ఒంగోలు ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్.. బోగీ మొత్తానికి కరెంట్ షాక్.. పలువురికి అస్వస్థత!

  • బాధితులను ఆసుపత్రికి తరలించిన రైల్వే అధికారులు
  • వేజెండ్ల స్టేషన్ వద్దకు రైలు చేరుకోగానే ఘటన
  • బోగీని తొలగించి మరో బోగీ అమర్చిన రైల్వే సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లోని ఓ ప్యాసింజర్ రైలులో ఈరోజు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలుకు వెళుతున్న ప్యాసింజర్ డెము రైలులో ఈరోజు సాంకేతిక సమస్య తలెత్తింది. రైలు వేజెండ్ల స్టేషన్ కు వద్దకు చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ జరిగి ఓ బోగీలో విద్యుత్ ప్రవహించింది.

ఈ ఘటనలో రైలులోని పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. వెంటనే చాలామంది ప్రయాణికులు రైలు బోగీ నుంచి దూకేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ప్రయాణికులను రైల్వే అధికారులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీకి అధికారులు తొలుత విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం రైలుకు మరో బోగీని జతచేసి పంపించివేశారు.
Andhra Pradesh
Guntur District
passenger train
short circuit
current shock

More Telugu News