varun tej: 15 రోజులకుగాను పూజా హెగ్డే పారితోషికం 2 కోట్లు!

  • స్టార్ హీరోలతో వరుస సినిమాలు 
  • యూత్ లో పెరిగిన క్రేజ్ 
  • పారితోషికం పెంచుకుంటూ వచ్చిన పూజ

ఇంతకుముందు రకుల్ మాదిరిగానే పూజా హెగ్డే కూడా ఒక్కసారిగా వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ఆమధ్య ఎన్టీఆర్ తో 'అరవింద సమేత' సినిమా చేయగా, తాజాగా మహేశ్ బాబుతో చేసిన 'మహర్షి' విడుదలకి ముస్తాబవుతోంది. ఇక ప్రభాస్ తో చేస్తోన్న సినిమా సెట్స్ పై వుంది. ఇలా ఒక్కసారిగా పూజా హెగ్డే రేంజ్ పెరిగిపోవడంతో ఆమె తన పారితోషికాన్ని పెంచేసిందట. ఆమె చెప్పిన పారితోషకం హరీశ్ శంకర్ కళ్లు తిరిగేలా చేసిందని టాక్.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' రూపొందుతోంది. వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమా కోసం మొదట ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని భావించారు. కానీ పూజా హెగ్డే అయితే ప్రాజెక్టు క్రేజ్ పెరుగుతుందని భావించి, ఆమెను సంప్రదించారు. 15 రోజులు కేటాయిస్తే చాలని చెప్పారట. అందుకు ఆమె 2 కోట్లు పారితోషికంగా అడిగిందని సమాచారం. 'దువ్వాడ జగన్నాథం' సినిమాకి 75 లక్షలు తీసుకున్న పూజా, ఇప్పుడు 2 కోట్లు అడగడంతో ఆ షాక్ నుంచి హరీశ్ ఇంకా తేరుకోలేదని చెప్పుకుంటున్నారు. 

More Telugu News