raana: 'విరాటపర్వం'లో లేడీ విలన్ గా టబు

  • వేణు ఊడుగుల నుంచి 'విరాటపర్వం'
  • రానా సరసన సాయిపల్లవి
  •  జూలై నుంచి సెట్స్ పైకి  

రానా కథానాయకుడిగా 'విరాటపర్వం 1992' సినిమా రూపొందనుంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితం కానుంది. రాజకీయ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించనుంది. ఈ సినిమాలో ఆమె నక్సలైట్ గా డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో 'టబు' నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్ర ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ తలెత్తుతోంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా .. ఒక రకంగా లేడీ విలన్ గా కనిపిస్తుందని అంటున్నారు. తన పాత్ర పూర్తి వైవిధ్యభరితంగా ఉండటం వలన, ఇంతరవరకూ ఈ తరహా పాత్రను తాను పోషించకపోవడం వలన ఈ పాత్ర చేయడానికి 'టబు' వెంటనే అంగీకరించిందని చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి .. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

More Telugu News