ఏపీ పోలీస్ శాఖలో పదోన్నతులపై విచారణ జరిపించాలి: గవర్నర్ కు విజయసాయిరెడ్డి లేఖ

  • అనుకూలమైన వారికి ప్రమోషన్లు కల్పించింది
  • గతంలో రూపొందించిన సీనియార్టీని తప్పుగా చూపారు
  • కన్ఫర్డ్ ఐపీఎస్ గా పదోన్నతులు కల్పించారు
ఏపీ పోలీస్ శాఖలో పదోన్నతులపై విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ కు ఓ లేఖ రాశారు. ప్రభుత్వం తమకు అనుకూలమైన వారికి ప్రమోషన్లు కల్పించిందని ఆరోపించారు. గతంలో రూపొందించిన సీనియార్టీని తప్పుగా చూపించి, కొందరికి కన్ఫర్డ్ ఐపీఎస్ గా పదోన్నతులు కల్పించారని, రాజకీయ ప్రయోజనాలతోనే ఇలా చేశారని ఆరోపించారు. గతంలో రూపొందించిన సీనియారిటీని పట్టించుకోకుండా, వాటిని డీజీపీ ఠాకూర్ పక్కన పెట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Go Back to Shorts
Andhra Pradesh
police
department
governer

More Telugu News