nepal: హిమాలయాల్లో సంచరిస్తున్నది ఎలుగుబంటే... అవి ‘యతి’ ముద్రలేమీ కావు: నేపాల్‌ ఆర్మీ అధికారులు

  • ఆ దేశ ఆర్మీ అధికారుల ప్రకటన
  • ఈ పాదముద్రలు తరచూ కనిపిస్తుంటాయి
  • పాదముద్రలు పోస్టు చేసిన భారత సైనికులకు వివరణ

హిమాలయాల్లోని మంచు పర్వతాల్లో యతి (మంచు మనిషి) తిరుగుతోందన్న భారత్‌ ఆర్మీ అధికారుల ప్రకటనను నేపాల్‌ ఆర్మీ అధికారులు ఖండించారు. అవి ఎలుగు బంటి పాద ముద్రలని, తరచూ ఈ ముద్రలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంటాయని స్పష్టం చేశారు. మేజర్‌ మనోజ్‌ నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందం ఏప్రిల్‌ 2న నేపాల్‌ మకల్‌ పర్వతారోహణకు బయలుదేరి వెళ్లింది. పర్వతారోహణ చేస్తున్న తమకు మకలు బేస్‌ క్యాంపు వద్ద యతి పాదముద్రలు కనిపించాయని ఈ బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్న పాదముద్రల ఫొటోలను ఏప్రిల్‌ 9న ఓ అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే భారత్‌ ఆర్మీ అధికారుల ప్రకటనపై నేపాల్‌ అధికారులు స్పందిస్తూ అవి ఎలుగు బంటి పాదముద్రలేనని స్పష్టం చేశారు.

More Telugu News