Maharashtra: గడ్చిరోలి వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా.. హింసతో ఏమీ సాధించలేరు!: నారా లోకేశ్

  • ఈరోజు గడ్చిరోలిలో ఐఈడీ పేలుడు
  • 16 మంది దుర్మరణం, కొనసాగుతున్న కాల్పులు
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ ఐటీ మంత్రి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు భద్రతాబలగాల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో డ్రైవర్ సహా 16 మంది భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ఖండించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘గడ్చిరోలిలో సీ-60 కమాండోలు లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నా. హింస కారణంగా ఇప్పటివరకూ ఎవరూ దేన్నీ సాధించలేకపోయారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నా. అమరులైన జవాన్ల కుటుంబాలతో మిగతా దేశ ప్రజలతో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఐఈడీ పేల్చిన మావోలను పట్టుకునేందుకు బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి.

More Telugu News