janasena: నిశ్శ‌బ్ద విప్ల‌వం ఉంది.. ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉంటాయి: జనసేన నేత మాదాసు గంగాధరం

  • జనసేనకు ప్రజాసేవే ముఖ్యం
  • రాష్ట్రానికి ఉజ్వల భ‌విష్యత్తు ప‌వ‌న్ కల్యాణ్ గారితోనే సాధ్యం
  • కాకినాడ పార్లమెంటరీ జనసైనికుల ఆత్మీయ సమావేశం

రాజ్యాధికారం చేప‌ట్టడానికి బ‌హుజ‌న స‌మాజ్ పార్టీకి 25 ఏళ్లు ప‌డితే.. జ‌న‌సేన పార్టీ మాత్రం ఐదేళ్ల‌లో సాధించ‌బోతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు. రాష్ట్రంలో నిశ్శ‌బ్ద విప్ల‌వం ఉందని, ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోతున్నాయ‌న్నారు. ఈరోజు కాకినాడ‌లోని స్పంద‌న ఫంక్ష‌న్ హాల్ లో కాకినాడ పార్ల‌మెంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఆత్మీయ స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి జనసేన ముఖ్య నేతలు హాజరై పోలింగ్ సంద‌ర్భంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ "జ‌న‌ సైనికులు అంటే అధ్య‌క్షులు ప‌వ‌న్ కల్యాణ్ గారికి ప్రాణం. మీరు వెనుక ఉన్నార‌న్న న‌మ్మ‌కంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారు. స‌ర్వేల్లో ఆ పార్టీ విజ‌యం సాధిస్తుంది.. ఈ పార్టీ విజ‌యం సాధిస్తుందని చెబుతున్నారు. మాకు స‌ర్వేల‌తో సంబంధం లేదు. మా పార్టీకి ప్ర‌జాసేవే ముఖ్యం. రాజ్యాధికారం అంద‌ని అనేక కులాలు, వ‌ర్గాల‌ను అంద‌లం ఎక్కించాల‌ని ఆయ‌న కృషి చేస్తున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన పార్టీకి గుండెకాయ‌లాంటిది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసి గ్రామ గ్రామాన జ‌న‌సేన జెండా రెప‌రెప‌లాడేలా కృషి చేయాలి. రాజ‌కీయాల్లో కొంత‌మందికే అవ‌కాశం వ‌స్తుంది. అలా వ‌చ్చిన వారు గొప్ప‌వారు కాదు, రానివారు త‌క్కువ కాదు. జ‌న‌ సైనికులు, నాయ‌కులు చిన్న చిన్న విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలి' అని మాదాసు గంగాధరం చెప్పారు.

More Telugu News