raana: రానా తాజా చిత్రంతో ప్రియమణి రీ ఎంట్రీ

  • రానా హీరోగా 'విరాటపర్వం 1992'
  • కథానాయికగా సాయిపల్లవి
  •  కీలకమైన పాత్రలో 'టబు'   

తెలుగులో 'యమదొంగ' .. 'పెళ్లైన కొత్తలో' సినిమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ప్రియమణి, ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించారు. కొత్త కథానాయికల పోటీ కారణంగా అవకాశాలు తగ్గుతూ రావడంతో, సినిమాలకి ఆమె దూరమయ్యారు. రానా సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజా సమాచారం.

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఒక భారీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం 'టబు'ను తీసుకున్నారు. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను ప్రియమణిని తీసుకున్నారట. ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రియమణికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి. 

More Telugu News