prabhas: యూరప్ లో శ్రద్ధా కపూర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయనున్న ప్రభాస్

  • ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో'
  • ముంబైలో జరుగుతోన్న చిత్రీకరణ 
  • యూరప్ లో పాట చిత్రీకరణకి సన్నాహాలు  

ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. వారం రోజులుగా ఈ సినిమా ముంబైలో షూటింగు జరుపుకుంటోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగు పూర్తవుతుందట.ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళ్లనున్నట్టు సమాచారం. ప్రభాస్ .. శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో ఒక పాటను అక్కడి అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారని అంటున్నారు. ఈ పాటలో శ్రద్ధా కపూర్ తో కలిసి ప్రభాస్ అదరగొట్టే స్టెప్పులు వేయనున్నాడని తెలుస్తోంది. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచేలా చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

More Telugu News