chiranjeevi: శ్రీదేవి నిర్మాతగా చిరంజీవితో ఒక సినిమా చేయాలనుకున్నారు: యండమూరి

  • నిర్మాతగా శ్రీదేవి రంగంలోకి దిగారు
  • కోదండరామిరెడ్డి ఆ సినిమాకి దర్శకుడు
  •  ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది

నవలా రచయితగా యండమూరి స్థానం ప్రత్యేకం. ఆయన రాసిన ఎన్నో నవలలు సినిమాలుగా తెరకెక్కి, ఘన విజయాలను అందుకున్నాయి. తాజా ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు. " శ్రీదేవిగారి సినిమాలైన 'ఆఖరిపోరాటం' .. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' .. 'ఒక రాధ.. ఇద్దరు కృష్ణులు' సినిమాలకి పనిచేశాను.

శ్రీదేవి గారు చిరంజీవి హీరోగా ఒక సినిమా తీయాలనుకున్నారు. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్. ఆ సినిమాకి వర్క్ చేస్తూ నేను ఆమె గెస్టు హౌస్ లో ఉండేవాడిని. ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా బప్పీలహరిని తీసుకున్నారు. ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఆ తరువాత కథ ఫైనలైజ్ కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరువాతనే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆమెతో మాట్లాడటమే గానీ, అంతకి మించిన పరిచయం లేదు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News