Odisha: అటవీశాఖ కార్యాలయంపై మావోల మెరుపుదాడి.. 3 తుపాకులు, 7 సెల్ ఫోన్లు తీసుకుని పరారీ!

  • ఒడిశాలోని నయాగఢ్ లో ఘటన
  • ఉన్నతాధికారులకు సమాచారమిచ్చిన సిబ్బంది
  • కూంబింగ్ ను ముమ్మరం చేసిన భద్రతాబలగాలు

సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. నయాగఢ్ జిల్లాలోని దస్ పల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇక్కడి అటవీశాఖ కార్యాలయంపై మెరుపుదాడి చేసిన మావోయిస్టులు.. అందులోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడ్డువచ్చిన అటవీశాఖ సిబ్బందిని చితకబాదారు. అనంతరం వారి నుంచి 3 తుపాకులు, ఏడు సెల్ ఫోన్లను లాక్కుని పారిపోయారు.

అటవీశాఖ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి. మూడో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న ఒడిశాలో 6 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. పోలీసులు, బలగాలు ఈ ఎన్నికల విధుల్లో నిమగ్నమైన నేపథ్యంలో మావోయిస్టులు అటవీశాఖ కార్యాలయంపై మెరుపుదాడి చేశారు.

More Telugu News