Kodandaram: నేడు ముంబైలో అఖిలపక్ష సమావేశం.. కోదండరాంకు చంద్రబాబు ఆహ్వానం

  • ఈవీఎంలు, వీవీప్యాట్లపై చర్చ
  • హాజరుకానున్న వివిధ పార్టీల ప్రతినిధులు
  • టీజేఎస్ నుంచి ఇద్దరు

ఈవీఎంలు, వీవీప్యాట్లపై చర్చించేందుకు నేడు ముంబైలో వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సహా దేశంలోని పలు పార్టీల ప్రతినిధులు ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్నారు. తెలంగాణలోని టీజేఎస్ పార్టీని కూడా చంద్రబాబు ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ చీఫ్ కోదండరాంతోపాటు పార్టీ అధికార ప్రతినిధి యోగశ్వర్ రెడ్డి కూడా సమావేశానికి హాజరుకానున్నారు.

More Telugu News