Sri Lanka: 'ఏసుక్రీస్తు'పైనా రక్తం చిందింది! శ్రీలంక దాడుల తీవ్రతకు అద్దం పడుతున్న ఫొటో ఇది!

  • నెత్తురోడిన చర్చిలు
  • ఈస్టర్ రోజున తీవ్ర విషాదం
  • శోకసంద్రంలా మారిన కొలంబో

ప్రకృతి అందాలకు పెట్టిందిపేరైన శ్రీలంకలో కనీవినీ ఎరుగని రీతిలో నరమేధం జరిగింది. ఐసిస్ ఉగ్రవాదులుగా భావిస్తున్న ఆత్మాహుతి దళ సభ్యులు కొలంబోలోని చర్చిలు, స్టార్ హోటళ్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 180 మందికి పైగా మరణించగా, 450 మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. అయితే, చర్చిల్లో ఎంతో శక్తిమంతమైన బాంబులతో పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఓ చర్చిలో ఉన్న ఏసుక్రీస్తు విగ్రహం కూడా రక్తసిక్తమైపోయింది. భక్తుల తాలూకు రక్తం, మాంస ఖండాలు ఎగిరివచ్చి ఏసు విగ్రహంపై పడ్డాయి. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ప్రార్థనమందిరాలు ఇప్పుడు నెత్తురోడాయి. ఎక్కడ చూసినా రక్తపు మడుగులు, ఛిద్రమైన శరీర అవయవాలు దర్శనమిస్తున్నాయి.

More Telugu News