మోదీకి బాలాకోట్కు, బాగల్కోట్కు తేడా తెలియదు: కుమారస్వామి
- మోదీ కంటే మా నాన్న దేవెగౌడ ఎంతో బెటర్
- ఆయన హయాంలో దేశంలో ఒక్క ఉగ్ర ఘటన కూడా జరగలేదు
- వ్యక్తిగత ప్రయోజనాల కోసం మోదీ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు
మోదీ ఐదేళ్ల పాలనకంటే తన తండ్రి, హెచ్డీ దేవెగౌడ పది నెలల పాలనతోనే దేశం భద్రంగా ఉందన్నారు. దేవెగౌడ హయాంలో దేశంలో ఒక చిన్న ఉగ్రదాడి కూడా జరగలేదని, దేశం ప్రశాంతంగా ఉందని అన్నారు. ఆయన హయాంలో జమ్ముకశ్మీర్ ఎంతో ప్రశాంతంగా ఉందని, చిన్న బాంబు దాడి కూడా జరగలేదని గుర్తు చేశారు.
‘‘దేశానికి ఎంతోమంది ప్రధానులు అయ్యారు. కానీ ఎవరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం భారత్-పాక్ సమస్యను ఉపయోగించుకోలేదు’’ అని మోదీపై దుమ్మెత్తిపోశారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నీరు పెట్టుకున్న విషయంపై కుమారస్వామి స్పందిస్తూ.. తాను చాలా సున్నిత మనస్కుడినని, చిన్న విషయాలకే ఉద్వేగానికి లోనవుతుంటానని వివరించారు.