akhil: అఖిల్ సరసన నాయికగా కైరా అద్వాని?

  • గీతా ఆర్ట్స్ బ్యానర్లో అఖిల్ 4వ సినిమా
  • దర్శకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్
  • సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు  

అఖిల్ ఖాతాలోకి వరుసగా మూడు పరాజయాలు చేరిపోయాయి. దాంతో నాల్గొవ సినిమాతో తప్పకుండా హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడు. అఖిల్ నాల్గొవ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు నిర్మించనున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో అఖిల్ సరసన ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది నాయికల పేర్లను పరిశీలించారట. చివరికి కైరా అద్వాని అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చేశారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో కైరా అద్వాని బిజీగా వుంది. అయినా ఆమెను ఒప్పించాలనే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ వారు సంప్రదింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. కైరా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

More Telugu News