Hardhik Patel: సభలో ప్రసంగిస్తుంటే హార్దిక్ పటేల్ చెంపపై కొట్టిన వ్యక్తి!

  • గుజరాత్ లో చేదు అనుభవం
  • సురేందర్ నగర్ లో ఘటన
  • తాను భయపడబోనన్న యువనేత

కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆయన, ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఉన్న వేళ, ఓ వ్యక్తి వేదికపైకి దూసుకొచ్చి హార్దిక్ చెంపపై కొట్టాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కవగా, కాంగ్రెస్ కార్యకర్తలు సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సురేందర్ నగర్ లో జరిగింది. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చిన హార్దిక్, బీజేపీ పాలనను విమర్శిస్తుండగా, ఈ ఘటన జరిగింది. ఆపై తన ప్రసంగాన్ని కాసేపు నిలిపి, తిరిగి కొనసాగించిన హార్దిక్, ఈ తరహా ఘటనలతో మోదీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని విచ్చిన్నం చేయలేదని, వీటికి తానేమీ భయపడబోనని, రానున్న ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని అన్నారు.

More Telugu News