Chandrababu: చంద్రబాబు ఓడిపోబోతున్నాడని ప్రకృతి కూడా చెబుతోంది: అంజాద్ బాషా

  • ప్రకృతి నుంచి సంకేతాలు వస్తున్నాయి
  • రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు
  • రైతులు ఆనందంగా ఉన్నారన్న అంజాద్ బాషా

చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడని ప్రకృతి కూడా సంకేతాలు ఇస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కడప అసెంబ్లీ నుంచి పోటీ పడిన అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. ఈ ఉదయం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, రెండు రోజుల నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని, నాలుగేళ్ల పాటు ఎండాకాలంలో ఎప్పుడైనా వర్షాలను చూశామా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ వర్షాలతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని, రాబోయే పంట సీజన్ లో మంచి దిగుబడి వస్తుందని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే, రైతులతో పాటు అన్ని వర్గాలకూ మంచి జరుగుతుందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. జగన్ హామీ ఇచ్చిన నవరత్నాలనూ అమలు చేసి తీరుతామని చెప్పారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలను ఈసీ నిలిపివేయించాలని అంజాద్ బాషా డిమాండ్ చేశారు.

More Telugu News