వారసత్వ రాజకీయాలను సమర్థించుకున్న కుమారస్వామి
- దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యం
- వారసత్వ రాజకీయాల వలన పలు రాష్ట్రాలు అభివృద్ధి
- బీజేపీ విమర్శలను పట్టించుకోము
వారసత్వ, ప్రాంతీయ రాజకీయాల వలన దేశంలోని పలు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాయన్నారు. బీజేపీ చేస్తున్న విమర్శలను తాము విస్మరిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని.. వారు తీసుకునే నిర్ణయమే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. 14 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.