Nagarjuna: రకుల్ పై నాగార్జున ఎప్పుడూ కోప్పడలేదు... అసలు విషయం చెప్పిన రాహుల్ రవీంద్రన్

  • రకుల్ గురించి లేనిపోని కథనాలు వస్తున్నాయి
  • మన్మథుడు-2లో ఆమె ఉండడం అదృష్టం
  • ఆమె అందం గురించే మాట్లాడుకునేవాళ్లం

చిత్ర పరిశ్రమలో నిజం కంటే ఊహాగానాలే వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇప్పుడు మన్మథుడు-2 విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను బరువు పెరగాలని దర్శకుడు ఆదేశించినా ఆమె పాటించకపోవడంతో నాగార్జున ఆమెపై కోప్పడ్డారని ప్రచారం జరుగుతోంది.

రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో 'దే దే ప్యార్ దే' అనే సినిమా కోసం ఏకంగా 10 కిలోల మేర స్లిమ్ అయింది. కానీ, మన్మథుడు-2లో రకుల్ మరీ సన్నగా ఉంటే బాగుండదని, కాస్త వెయిట్ పెరిగితే బాగుంటుందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అమ్మడికి సూచించాడట.

దర్శకుడు చెప్పింది రకుల్ వినలేదని, అందుకే నాగార్జున తిట్టారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. దీనిపై యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అసలు విషయం చెప్పారు. రకుల్ ను హీరో నాగార్జున కోప్పడ్డారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు.

"పోర్చుగల్ లో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె మాతోనే ఉన్నారు. సెట్స్ పై ఎప్పుడూ రకుల్ ప్రీత్ అందం గురించే డిస్కషన్ జరిగేది. ప్రతిభావంతురాలైన రకుల్ లాంటి నటి మా సినిమాలో ఉన్నందుకు అదృష్టంగా ఫీలవుతుంటాం తప్ప ఆమె బరువు విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు" అని స్పష్టం చేశారు.

More Telugu News