Andhra Pradesh: విచారణ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ ఐఏఎస్ శ్రీలక్ష్మిని కొట్టారు.. సంచలన ఆరోపణ చేసిన బీజేపీ నేత!

  • ఓబులాపురం మైనింగ్ కేసులో ఇది జరిగింది
  • విచారణ సందర్భంగా శ్రీలక్ష్మిని కొట్టారు
  • ఆమె కొలీగ్ స్వయంగా ఈ విషయం నాతో చెప్పారు

బీజేపీ నేత రఘురాం ఈరోజు జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణపై సంచలన ఆరోపణలు చేశారు. ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ సమయంలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై జేడీ లక్ష్మీనారాయణ చేయి చేసుకున్నారని ఆరోపించారు. దీంతో శ్రీలక్ష్మి కుంగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని శ్రీలక్ష్మి బ్యాచ్ మేట్ స్వయంగా తనతో చెప్పారని వ్యాఖ్యానించారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో జేడీ ఓ మహిళ అని కూడా చూడకుండా శ్రీలక్ష్మిపై దాడిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో రఘురాం ఈ మేరకు స్పందించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి నడవలేని స్థితిలో వీల్ చెయిర్ కు పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై జనసేన నేత లక్ష్మీనారాయణ ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News