ఏపీలో 141 సీట్లతో టీడీపీ అధికారంలోకి రాబోతోంది!: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
- టీడీపీ బలంగా ఉన్నచోటే ఈవీఎంలు మొరాయించాయి
- దీనివెనుక మోదీ, కేసీఆర్, జగన్ కుట్ర ఉంది
- గుంటూరులో మీడియాతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు
గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నచోట మాత్రమే ఈవీఎంలు మొరాయించాయని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. టీడీపీ నేతలపై ఐటీ దాడుల వెనుక మోదీ, కేసీఆర్ జగన్ కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.