saidharam tej: 'చిత్రలహరి' తొలిరోజున రాబట్టిన వసూళ్లు

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'చిత్రలహరి'
  • ఈ సినిమా సక్సెస్ పైనే తేజు ఆశలు
  • నిరాశ పరుస్తోన్న యూఎస్ వసూళ్లు  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజున 4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

వరుసగా 6 పరాజయాల తరువాత తేజు చేసిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా సక్సెస్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సోమవారం వసూళ్లతో ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది తెలిసిపోతుంది. యూఎస్ వసూళ్లు మాత్రం తేజుకి .. ఆయన అభిమానులకి నిరాశను కలిగించేవిగా ఉన్నాయని అంటున్నారు. ఇక కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ కూడా ఈ సినిమా తమని నిలబెడుతుందనే నమ్మకంతో వున్నారు.

More Telugu News