devegowda: కర్ణాటకలో మరో ఐటీ దాడి.. దేవెగౌడ కుటుంబ ఆలయంపై దాడులు

  • దేవెగౌడ స్వగ్రామంలోని శివాలయంలో దాడులు
  • గర్భగుడిలోకి ప్రవేశించేందుకు యత్నించిన అధికారులు
  • అడ్డుకున్న ఆలయ సిబ్బంది

కర్ణాటకలో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో ఐటీ దాడులు జరిగాయి. ఈ ఆలయం దేవెగౌడ స్వగ్రామమైన హరదనహళ్లిలో ఉంది. ఆ దాడులపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ దాడులపై ఆలయ పూజారి భార్య మీడియాతో మాట్లాడుతూ, ఇద్దరు ఐటీ అధికారులు వచ్చి ఆలయం పక్కన ఉన్న తమ ఇంట్లో తనఖీలు నిర్వహించారని చెప్పారు. చివరకు అత్యంత పవిత్రమైన గర్భగుడిలోకి ప్రవేశించేందుకు కూడా యత్నించారని... దానిని తాము అడ్డుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఆలయంలో సోదాలు నిర్వహించి ఖాళీ చేతులతో వెనుదిరిగారని చెప్పారు. తనిఖీల సందర్భంగా దేవెగౌడ కుటుంబానికి చెందిన సొమ్మును ఇక్కడ ఉంచారా? అని అధికారులు తమను ప్రశ్నించారని ఆమె తెలిపారు.

More Telugu News