Guntur District: గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగుకు ప్రతిపాదనలు

  • మొదటిది.. గుంటూరు పశ్చిమలోని 244వ కేంద్రం
  • రెండోది.. నరసరావుపేటలోని 94వ కేంద్రం
  • కలెక్టర్ సిఫారసుల మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపాం: ద్వివేది

గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ కేంద్రం ఒకటి కాగా, నరసరావుపేటలోని 94వ కేంద్రం రెండోది అని, ఈ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలన్న గుంటూరు కలెక్టర్ సిఫారసుల మేరకు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. సీఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

More Telugu News