New Delhi: దేశ రాజధానిలో.. దొంగనుకొని అమాయకుడిని కొట్టి చంపేశారు!

  • ఇంటి ముందుంటే దొంగగా భావించి దాడి
  • ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే మృతి
  • ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ అమాయకుడిని దొంగగా భావించిన ఢిల్లీ వాసులు అతన్ని దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నిన్న రాత్రి ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో ఓ వ్యక్తి, ఓ ఇంటి ముందు నిలబడి వుండటాన్ని స్థానికులు చూశారు. అతన్ని దొంగని ఆరోపిస్తూ, చుట్టుముట్టి కర్రలతో ఇష్టానుసారం చితకబాదారు. దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు.

విషయం తెెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని ఆసుపత్రికి తరలించే సరికే మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, ఈ ఉదయం అతన్ని కొట్టినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. 

More Telugu News