rajasekhar: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'కల్కి' టీజర్ .. అసలు కథ ఇదేనంటూ టాక్

  • ప్రశాంత్ వర్మ నుంచి 'కల్కి'
  • యధార్థ సంఘటనల ఆధారంగా సాగే కథ
  •  పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్      

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ కథానాయకుడిగా 'కల్కి' సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఉత్కంఠను రేపేలా వున్న సన్నివేశాలను చూసినవాళ్లలో, కథా నేపథ్యం ఏమై ఉంటుందా? అనే ఆసక్తి పెరుగుతూపోతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతుందనే విషయాన్ని ఈ టీజర్ ద్వారా చెప్పారు.

1985 ప్రాంతంలో కృష్ణాజిల్లాలోని మూడు సంపన్న కుటుంబాలవారిని చంపడం కోసం ప్రత్యర్థులు మంచినీటి సరస్సులో విషం కలిపారు. అదే సమయంలో గుంటూరు జిల్లాలో వరుస హత్యలు జరిగాయి. ఈ రెండు సంఘటనలను కలుపుతూ ఈ కథను రాసుకున్నారట. ఈ సంఘటనలపై విచారణ జరపడం కోసం నియమించబడిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ కనిపిస్తారని అంటున్నారు. ఈ సినిమాతో రాజశేఖర్ ఖాతాలోకి మరో హిట్ చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News