Vijayawada: రేపు విజయవాడలో ఓటు వేయనున్న పవన్ కల్యాణ్

  • ఏపీలో రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు
  • విజయవాడలో ఓటు వేయనున్న పవన్
  • రేపు ఉదయం 7.30-8.00 గంటల సమయంలో ఓటు వేస్తారన్న ‘జనసేన’

ఏపీలో రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రేపు ఉదయం 7.30-8.00 గంటల సమయంలో విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్ లో ఉన్న పోలింగ్ బూత్ లో పవన్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. 

More Telugu News