Lakshmi: నారాయణపేట దుర్ఘటనలో మృతులంతా ఒకే గ్రామానికి చెందిన మహిళలు!

  • కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి
  • గుట్ట కింద సేద తీరుతుండగా ప్రమాదం
  • గాయాలతో బయటపడిన లక్ష్మి

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఉపాధి కూలి పనుల కోసం వెళ్లి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఎండ ఎక్కువగా ఉండటంతో కూలీలంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. అయితే ఈ ఘటనలో మ‌ృతులంతా మహిళలే కావడం గమనార్హం. మృతులంతా పీలేరు గ్రామవాసులే కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘటనలో సీహెచ్‌ లక్ష్మి అనే మరో మహిళ గాయాలతో బయటపడింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిలో, కె. లక్ష్మి (30), లక్ష్మి(28), బుడ్డమ్మ(26), పి. అనురాధ(30), మంగమ్మ(32), కేశమ్మ(38), అనంతమ్మ(45), బి. అనంతమ్మ(35), బి. లక్ష్మి(28), బీమమ్మ(40) ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

More Telugu News