Andhra Pradesh: పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు.. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు!

  • పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఘటన
  • అదుపు తప్పి కాలువలో పడిపోయిన వాహనం
  • చిన్నారులను కాపాడిన స్థానికులు, ఆసుపత్రికి తరలింపు

పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఈరోజు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారులతో స్కూలుకు వెళుతున్న ఓ పాఠశాల బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు కాగా, మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. వీరికి ప్రాథమిక చికిత్స అందజేసిన అనంతరం ఇళ్లకు పంపించివేశారు.

నరసాపురంలోని వశిష్టా స్కూలుకు చెందిన బస్సు ఈరోజు పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వస్తోంది. ఈ క్రమంలో మార్గమధ్యంలో అదుపుతప్పిన బస్సు పంటకాలువలోకి దూసుకెళ్లింది. దీంతో  భయపడిపోయిన చిన్నారులు కేకలు వేశారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే చిన్నారులను బయటకు తీశారు.

అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News