Kanakamedala Ravindra kumar: వైసీపీ తీరు వల్ల ఎన్నికల సంఘానికి చెడ్డ పేరు వస్తోంది: ఎంపీ కనకమేడల

  • విజయసాయి మాటలు వైరల్ అవుతున్నాయి
  • మద్దతు తెలియజేస్తున్నట్టు ఆడియోలో ఉంది
  • వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలి

వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆడియో టేప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. నేడు ఆయన టీడీపీపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. వైసీపీ తీరు వల్ల ఎన్నికల సంఘానికి చెడ్డ పేరు వస్తోందని, వైసీపీకి ఈసీ మద్దతు తెలియజేస్తున్నట్టు ఆడియో సంభాషణలో ఉందని లేఖలో పేర్కొన్నారు.

More Telugu News